సత్యయుగంలో విష్ణువు అవతరించి (ప్రపంచములో సత్యము, శాంతి, దయ, క్షమ మరియు స్నేహాన్ని స్థాపించాడు. ఆ సమయంలో మానవులందరూ వేదపండితులు మరియు అందరు వైదిక సాంప్రదాయం జ్ఞానపరంగా అహంకారం, గర్వము అభిమానము కలిగి ఉండేవారు. ఆ పాపం వలన సత్యయుగానికి అంతం వచ్చింది. శ్రీరావండు త్రేతాయుగములో అవతరించాడు. త్రేతాయుగంలో (ప్రజలు యజ్ఞము మొదలగు పుణ్య కార్యముల ద్వారా భగవాన్ శ్రీరాముని ద్వారా ప్రయోజనం పొందారు. త్రేతాయుగము చివరిలో వారు రావణుడు మొదలగు పాపాత్ములను నాశనము చేసేశారు. చివరిలో ఖండప్రళయము వచ్చింది.
మళ్లీ మానవులు త్రేతాయుగం నుండి ద్వాపర యుగానికి రావడము గోలోకధామ భక్తులు ద్వాపరయుగంలో జన్మ తీసుకోవడము జరిగింది. వారు భగవాన్ శ్రీ కృష్ణుని శరీరంలో ప్రవేశించి గోలోక వైకుంఠ దామానికి చేరుకున్నారు.
కలి తన కార్యప్రభావము వలన వ్యాపించినది. దీనిగురించి భాగవతములో ఈ క్రింది శ్లోకము (గ్రహించండి.
“యదా దేవర్షయః సప్తమాఘసు విచరతి హి
తదా (ప్రవృత్తస్తు కలి ర్థ్వాదశాబ్దశతాత్మకః
మహాత్ములైన సప్తర్నులు మఘా నక్ష్మత్రము నందు సంచరించు సమయమున కలియుగము (ప్రారంభమగును కలియుగము యొక్క ప్రమాణము దేవతల కాలమానము అనుసరించి పన్నెండు వందల (1200) సంవత్సరాలు అనగా మానవుల కాలమానము (ప్రకారము 4,32,00 సంవత్సరాలు.
అప్పుడు మఖ నక్షత్రములో సప్తర్షుల చారము జరిగినది (అది శ్రీకృష్ణ పరమాత్మ శరీరము విడిచిన సమయము). తరువాత మహారాజు పరీక్షిత్తు దేహము త్యాగము చేశారు. దాని తర్వాత సంపూర్ణ కలియుగము ప్రారంభమైనది. ప్రపంచమంతట కలి తన ప్రభావమును వ్యాపింప జేసినది ఈ యుగములో మానవులు వ్యభిచారము సోమరి తనము క్రోదము అహంకారము వ్యభిచారము సోమరి తనము వంటి దుర్గుణాలకు లోనౌతారు.
శాస్త్ర పురాణ, వేద జ్ఞానమునకు వ్యతిరేక కార్యాలు చేస్తారు. వేద విరోధ కార్యాలు చేస్తారు. ధర్మాన్ని తప్పుగా అర్థము చేసుకుంటారు. పుశు హత్య పాపములు చేస్తారు. మారకద్రవ్య మత్తుపసుహత్య పాపములు చేస్తారు. మారక(ద్రవ్య మత్తు పదార్ధాలు సేవిస్తారు. దైవారాధన విరోధుతలౌతారు వీరిని కలియుగములో మ్హేచ్చులు అంటారు.
“మ్లేచ్చ నివాహనిధనే కలయసి కరవాలమ్
ధూమ కేతుమివ కిమపి కరాలమ్ కేశవ
ధృత కల్మి శరీర
జయ జగదీశ హరే”
ఈ దుష్ట పాపులను మరియు మ్లేచ్చులను నాశనం చేయడానికి కల్కి భగవానుడు అవతరించితోక చుక్కలా ఉగ్రరూపం ధరిస్తాడు.
“జై జగన్నాథ్”